Google : గూగుల్‌కు తెలంగాణ మహిళలు గట్టి పోటీ: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: Telangana Women Are Tough Competition for Google

Google : గూగుల్‌కు తెలంగాణ మహిళలు గట్టి పోటీ: సీఎం రేవంత్ రెడ్డి:హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను (GSEC) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సెంటర్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దీనికి సమీపంలోనే మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి సెంటర్ ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను (GSEC) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సెంటర్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దీనికి సమీపంలోనే మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి సెంటర్ ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. “తెలంగాణ మహిళలు గూగుల్‌కు గట్టి పోటీ” అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచం వేగంగా డిజిటల్ యుగం వైపు అడుగులేస్తోందని, ఈ క్రమంలో డిజిటల్ సమాచార భద్రత చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రజల డిజిటల్ సమాచారం సురక్షితంగా ఉన్నప్పుడే వారు క్షేమంగా ఉన్నట్లు భావించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, డిజిటల్ భద్రతను పెంపొందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.గూగుల్ ఒక ఇన్నోవేటివ్ కంపెనీ. మా ప్రభుత్వం కూడా ఇన్నోవేటివ్‌గానే పనిచేస్తుంది. రాష్ట్రంలో యువత నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం” అని ముఖ్యమంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానంగా మారుతోందని, తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమని వివరించారు.రాష్ట్ర ఆర్థిక ప్రగతి లక్ష్యాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. “2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం” అని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. “ఇక్కడి మహిళలు కేవలం లబ్ధిదారులుగా మిగిలిపోకుండా, ధనిక పెట్టుబడిదారులకు దీటైన పోటీదారులుగా ఎదుగుతున్నారు. ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు, వినూత్న విధానాలు తీసుకొస్తున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

Read also:Rajinikanth : రజనీకాంత్ ‘కూలీ’పై భారీ అంచనాలు

 

Related posts

Leave a Comment